గోపాష్టమి స్తుతి

గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత ‘సురభీదేవి’. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ ‘శ్రీసురభ్యై నమః’ అనే మంత్రాన్ని జపించి, క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే, ఆయురారోగ్యైశ్వర్యాలు, అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి, ధనము, జ్ఞానము, క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఈ ‘గోపాష్టమి స్తుతి’. (దేవీ భాగవతం అంతర్భాగంగా)

గోపాష్టమి స్తుతి:

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం!గవామధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్!!

పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం!యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ్!!

నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః!గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే!!

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః!నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః!!

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే!క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః!!

శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః!యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.